వైస్సార్సీపీ సర్కార్ ఫై రఘురామ కీలక వ్యాఖ్యలు

వైస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి ఏపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గత కొద్దీ నెలలుగా క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి రోజు ఎక్కడో చోట మహిళా ఫై అత్యాచారం జరుగుతుంది. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ తరుణంలో వైసీపీ ప్రభుత్వం ఫై ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. ఈ తరుణంలో వైసీపీ పార్టీ నుండి ఎంపీగా గెలిచి..ఆ పార్టీ కే వ్యతిరేకిగా మారిన రఘురామ కృష్ణం రాజు వైస్సార్సీపీ పార్టీ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.

ఏపీలో నిత్యం ఎన్నో ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కృష్ణం రాజు ఆరోపించారు. రాష్ట్రంలో లేని చట్టాల గురించి వైస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్నారని రఘురామకృష్ణ విమర్శించారు. “ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నట్లు క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడైందని, మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8వ స్థానంలో ఉంటే… పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనల్లో 2వ స్థానంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై భౌతికదాడుల విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 2019తో పోల్చితే రాష్ట్రంలో నేరాల పెరుగుదల 63 శాతంగా నమోదైందన్నారు. 2021లో అత్యధిక లాకప్ లు ఏపీలోనే జరిగాయన్న రఘురామకృష్ణ.. అదృష్టం బాగుండి నేను బయటపడ్డానంటూ.. ధ్వజమెత్తారు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చినా రాష్ట్రం అప్పులు తీరవు. 175 సీట్లు వస్తాయని అంటున్నారు.. కానీ… 17 సీట్లు రావడమే కష్టమన్న రఘురామ.. వైస్సార్సీపీ లో ప్రక్షాళన జరగాలన్నారు.