దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి బిజెపి పిలుపునిచ్చిన నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు గృహనిర్భందం చేసారు. గచ్చిబౌలి లోని ఆయన నివాసంలో నిర్బంధించారు. ఇదిలా ఉంటే ఖచ్చితంగా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరుగుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. అటు కలెక్టరేట్ ముట్టడి కి వెళ్లకుండా జిల్లాలో బీజేపీ నాయకులను కూడా ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు పోలీసులు. వరిసాగుకు వ్యతిరేఖంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఇటీవల వ్యవసాయ అధికారులు సమావేశంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరి సీడ్ అమ్మే వాళ్ల షాపులను సీజ్ చేస్తానని, సుప్రీం కోర్ట్ నుంచి అనుమతి తెచ్చుకున్నా వదిలేదని, రైతులు యాసంగిలో వరిసాగు చేయకూడదంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా వేడి పెంచింది.