ఆయన పై విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌లు స‌రికాదు

విజ‌య‌సాయిరెడ్డి గురించి సీఎం జ‌గ‌న్‌కు రఘురామకృష్ణరాజు లేఖ‌

అమరావతి: ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీఎం జగన్ కు మ‌రో లేఖ రాశారు. వ‌రుస‌గా తొమ్మిది రోజుల పాటు వైస్సార్సీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ఎన్నిక‌ల ముందు ఆ పార్టీ ఇచ్చిన హామీల‌ను గుర్తు చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఈ రోజు మాత్రం వైస్సార్సీపీ ఎంపీ విజయస్థాయి రెడ్డి గురించి లేఖ రాశారు. మాన్సాస్ చైర్మ‌న్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి చేస్తోన్న వ్యాఖ్య‌ల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. విజయసాయిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకొంటున్నారని ఆయన చెప్పారు. ఆయ‌న‌ను అదుపు చేయాలని జ‌గ‌న్‌ను లేఖలో కోరారు.

విజయసాయిరెడ్డి తీరు వ‌ల్ల వైస్సార్సీపీ కి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అశోక్‌గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం సరికాదని తెలిపారు. మాన్సాస్‌ ట్రస్టుపై ఇటీవ‌ల‌ హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిందని, అప్ప‌టి నుంచి అశోక్‌గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారి ఆయ‌న చెప్పారు. వైస్సార్సీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వెంటనే అదుపులో పెట్టాలని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/