‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ అంబాసిడర్గా పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వెల్లడి
భారత స్టార్ బ్యాడ్మింటన్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ ప్రచారానికి అంబాసిడర్గా ఆమె ఎంపికైంది. కెనడా షట్లర్ మిషెల్లీ లీకి కూడా ఈ గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజాగా వెల్లడించింది.
తన నియామకంపై పీవీ సింధు స్పందించింది. ‘తనను రాయబారిగా ఐఓసీ ఎంపిక చేయడం నాకు దక్కిన గౌరవం. పోటీల్లో అవకతవకలపై పోరాటంలో నా సహచర అథ్లెట్లతో కలిసి నిలబడతా. కలిసికట్టుగా మనం బలంగా ఉండగలం’ అని పేర్కొంది. రాయబారులుగా ఎంపికైన వీరు సామాజిక మాధ్యమాల ద్వారా బ్యాడ్మింటన్ ప్లేయర్లకు అవగాహన కల్పించనున్నారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/