పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం

పీవీ జ్ఞానభూమిలో నివాళులర్పించిన సిఎం కెసి ఆర్

TS CM KCR tribute to PV

Hyderabad: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ సీఎం కేసీఆర్  ‌ ప్రారంభించారు.

నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో పీవీ నరసింహారావు చిత్రపటం వద్ద కేసీఆర్‌   నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు, తెరాస నేతలు నివాళులర్పించారు.

కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..పీవీ మహోన్నతుడని ప్రస్తుతించారు.

ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/