పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
పీవీ జ్ఞానభూమిలో నివాళులర్పించిన సిఎం కెసి ఆర్
Hyderabad: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో పీవీ నరసింహారావు చిత్రపటం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు, తెరాస నేతలు నివాళులర్పించారు.
కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..పీవీ మహోన్నతుడని ప్రస్తుతించారు.
ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/