డిసెంబర్ 6 న పుష్ప ట్రైలర్ విడుదల
పాన్ ఇండియా మూవీ పుష్ప ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేసారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు. పుష్ప ట్రైలర్ ను డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ వదిలింది చిత్ర బృందం. ఈ అప్డేట్ తో బన్నీ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.