పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఫిక్స్

పాన్ ఇండియా మూవీ పుష్ప ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేసారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల ఫై దృష్టి పెట్టిన చిత్ర యూనిట్..డిసెంబర్‌ 12 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను హైదరాబాద్‌ లో నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తుంది. సినిమా రిలీజ్ కు నాల్గు రోజుల టైం ఉంటుంది కాబట్టి ప్రీ రిలీజ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే పుష్ప : ది రైజ్’ చిత్రం ట్రైలర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండబోతోందని టాక్. ఇక ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం 500 ప్లస్ థియేటర్స్ లో 1000 పైగా స్క్రీన్స్ లలో ఈ చిత్రం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.