పుష్ప ప్రీబుకింగ్స్ లో సరికొత్త రికార్డ్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ తరుణంలో ఓవర్సీస్లో ఈ సినిమా ప్రీ బుకింగ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఇదే విషయాన్ని పోస్టర్ వేసి మరీ వెల్లడించింది చిత్రబృందం. ఇంకా రిలీజ్ కి ముందే అమెరికాలో ఏకంగా 2లక్షల డాలర్లు పైగా ప్రీబుకింగ్స్ రూపంలో పుష్ప – 1 కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. హంసిని ఎంటర్ టైన్ మెంట్స్ -క్లాసిక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా అమెరికాలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. అమెరికాలో స్థానిక బయ్యర్లతో వ్యాపారపరమైన డీల్స్ కుదురుతున్నాయని తెలిసింది. అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప విజయంపైనా ధీమా పెరిగింది. అందుకే పుష్ప ను ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.