పుష్ప పార్ట్ 1 రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలోను ప్రకటించిన విషయం తెలిసిందే.

అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. ఈ మూవీని డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. రీసెంట్ గా రష్మిక తాలూకా ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆకట్టుకున్నారు. అలాగే ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో పోషిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్‌లో నటిస్తున్నాడు.

This December, Theatres will go Wild with the arrival of #PushpaRaj 🔥#PushpaTheRise will hit the Big Screens on DEC 17th.#PushpaTheRiseOnDec17#ThaggedheLe 🤙@alluarjun @iamRashmika #FahadhFaasil @Dhananjayaka @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/qkDSOM41G9— Pushpa (@PushpaMovie) October 2, 2021