సిఎఎకు వ్యతిరేకంగా పంజాబ్‌ శాసనసభ తీర్మానం

Punjab Assembly

Chandigarh: సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)కు వ్యతిరేకంగా పంజాబ్‌ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించారు. ఈ వివాదాస్పద చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర మంత్రి బ్రహ్మ మహీంద్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే కేరళ శాసనసభలో సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన విషయం విదితమే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/