రేపు రెండో పెళ్లి చేసుకోనున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్
ఛండీగఢ్లో జరగనున్న వేడకకు హాజరుకానున్న కేజ్రీవాల్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ సింగ్ గురువారం పెళ్లి చేసుకోనున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్తో రెండో వివాహం జరుగనున్నది. తన రెండో వివాహాన్ని అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. ఛండీగఢ్లోని తన నివాసంలో జరిగే ఈ వివాహ వేడుకకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు పార్టీ ముఖ్యులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఆప్ చేరిన తర్వాత ఆరేళ్ల క్రితమే భగవంత్ మాన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఆరేళ్లుగా వివాహం అనే మాటే ఎత్తకుండా సాగిన భగవంత్ తాజాగా పంజాబ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే రెండో పెళ్లి చేసుకుంటూ ఉండటం గమనార్హం. వైద్యురాలు అయిన డాక్టర్ గుర్ ప్రీత్ కౌర్ ను భగవంత్ రెండో వివాహం చేసుకోనున్నారు.
కాగా, సీఎం భగవంత్ మాన్ సింగ్కు ఇది వరకు ఇందర్ప్రీత్ కౌర్తో పెళ్లయింది. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆరేళ్ల వివాహ బంధం తర్వాత మొదటి భార్య ఇందర్పీత్ర్ కౌర్, ఆయన విడిపోయారు. భగవంత్ మాన్కు తొలి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.
పంజాబ్ ఎన్నికల్లో ఆప్ అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో భగవంత్ మాస్ సింగ్ సీఎం అయ్యారు. మరోవైపు ఆయన మరో పెళ్లి చేసుకోవాలని తల్లి, సోదరి సూచించారు. వారిద్దరికి తెలిసిన వైద్యురాలు గురుప్రీత్ కౌర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. దీంతో గురువారం చండీగఢ్లోని భగవంత్ మాన్ సింగ్ నివాసంలో గురుప్రీత్ కౌర్తో ఆయన రెండో పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేటుగా జరుగనున్నది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/