వాళ్ల కోసం స్వ‌యంగా వంట చేసిన పంజాబ్ సీఎం

చండీగ‌ఢ్‌: ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వాళ్ల కోసం చాలా రాష్ట్రాలు భారీగా న‌గ‌దు బ‌హుమతులు ప్ర‌క‌టించాయి. పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ మాత్రం.. వాటితోనే ఆగ‌కుండా ఓ అడుగు ముందుకేసి మెడ‌లిస్ట్‌ల కోసం స్వ‌యంగా వంట చేసి పెట్టారు. మొహాలీలో ఉన్న మొహింద‌ర్ బాగ్ ఫామ్‌హౌజ్‌కు బుధ‌వారం నీర‌జ్ చోప్రాతో పాటు ఇత‌ర మెడ‌ల్ విన్న‌ర్లు వ‌స్తున్నారు. వీళ్ల కోసం పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ గ‌రిట పట్టుకున్నారు.

ఈ మేరకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్ర‌త్యేకంగా మ‌ట‌న్ బిర్యానీ, జ‌ర్దా రైస్, పులావ్‌, చికెన్ చేసి పెట్టారు. ప‌టియాలా రాయ‌ల్ అయిన అమ‌రీంద‌ర్‌.. అక్క‌డి ప్ర‌త్యేక వంట‌కాలు కూడా సిద్ధం చేశారు. ఒలింపిక్ మెడ‌ల్ విన్న‌ర్ల కోసం తాను స్వ‌యంగా వండి పెడ‌తాన‌ని గ‌తంలోనే ఆయ‌న చెప్పారు. టేస్టీ ఫుడ్ చేయ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్ అయిన అమ‌రీంద‌ర్ చేతి వంట తిన‌డానికి కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా ఎగ‌బ‌డ‌తారు. నీర‌జ్ చోప్రాతోపాటు 30-40 మంది ఒలింపియ‌న్లు బుధ‌వారం ఈ డిన్న‌ర్‌కు రానున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/