127 మంది హైదరాబాదీలకు నోటీసులు జారీ
ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలి..నిరూపించుకోకపోతే ఆధార్ కార్డులను రద్దు చేస్తాం
హైదరాబాద్: 127 మంది హైదరాబాదీలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) పౌరసత్వం నిరూపించుకోవాలంటూ షాక్ ఇచ్చింది. ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం భారత పౌరులమని నిరూపించుకోకపోతే ఆధార్ కార్డులను రద్దు చేస్తామని తెలిపింది. ఆటో డ్రైవర్గా పనిచేస్తోన్న సత్తర్ ఖాన్ అనే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలతో ఆధార్ కార్డు అందుకున్నారన్న ఫిర్యాదు మేరకు ఉడాయ్ ఈ నెల 3న అతనికి నోటీసులు జారీ చేసింది. పౌరసత్వం లేకపోతే, భారత్లోకి చట్టబద్ధంగానే ప్రవేశించామన్న విషయాన్ని నిరూపించుకోవాలని చెప్పింది. దీంతో అతడు తన ఫేస్బుక్ ఖాతాలో తన ఆవేదనను తెలిపాడు. తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందారంటూ తమకు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలోనే నోటీసులు పంపామని అధికారులు చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/