బహిరంగ ప్రదేశాలలో ఉమ్మడం నిషేదం
కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోన కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడాన్ని నిషేదించింది. రోడ్లపై, కార్యాలయాలు, సంస్థలు వంటి ప్రదేశాలలో పాన్, తంబాకు నమిలి ఉమ్మివేయడాన్ని ప్రభుత్వం నిషేదించింది. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేశారు. ప్రజారోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/