ఎల్లుండి షూటింగ్స్ కు బంద్ ప్రకటించిన నిర్మాతల మండలి

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నిర్మాతల మండలి ఎల్లుండి షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. కృష్ణ (80) సోమవారం తెల్లవారు జామున గుండెపోటుకు గురైన సంగతి తెల్సిందే. దీంతో వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్ కుటుంబ సభ్యులు చేర్పించారు. కానీ చికిత్స పొందుతూనే ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయారు. కృష్ణ మరణ వార్త తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ కడసారి చూసేందుకు హాస్పటల్ కు తరలివెళ్ళ్లారు.

ప్రస్తుతం కృష్ణ భౌతిక దేహాన్ని కాంటినెంటల్ హాస్పటల్ నుండి నానక్ రామ గూడ లోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. మధ్యాహ్నం గచ్చిబౌలి లోని స్టేడియం లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. రేపు ఉదయం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి టాలీవుడ్‌ లో షూటింగ్‌ లు బంద్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది చిత్ర పరిశ్రమ. ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించాలని నిర్ణయం తీసుకున్నారు.