గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్: సీఎం జగన్
అమరావతి: సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఉద్యోగుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామన్నారు. పీఆర్సీ అమలు అన్నింటిపై ప్రకటనలు చేశామని, వాటిని వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు మంచి జరగాలనే సర్వీసును పెంచామన్నారు సీఎం జగన్. యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్న్యూస్ చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని, జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. మిగిలిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్ ఎగ్జామ్స్ కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, మార్చి ఫస్ట్ వీక్లో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ ప్రొబేషన్పై నిర్ణయం తీసుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/