అలాంటి వారిని పాకిస్థాన్‌కు పంపించాలి

ఇక్కడి తిండి తింటూ..పాకిస్థాన్‌ పాట పాడేవాళ్లను కాల్చి చంపాలి

appachu ranjan
appachu ranjan

బెంగళూరు: పౌరసత్వ నిరసనకారులపై కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఏఏ నిరసనల పేరుతో పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటున్న వారిని కాల్చి చంపేందుకు చట్టం తేవాలని పేర్కొన్నారు. లేదంటే అలాంటి వారిని పాకిస్థాన్‌కు పంపించాలని అన్నారు. భారత్‌లో ఉంటూ..ఇక్కడి తిండి తింటూ..పాకిస్థాన్‌ పాట పాడేవాళ్లను కాల్చి చంపాలి. లేదంటే వారిని పాకిస్థాన్‌ తరమివేయాలని అన్నారు. అలాంటి వారిపట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. వారిపై నమోదైన కేసుల విషయంలో కూడా ఉదారత అవసరం లేదు అని పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/