ప్రియాంకగాంధీ బంగ్లా నుండి సామాన్లు తరలింపు

ఖాళీ చేయాలని గతవారం కేంద్రం ఆదేశం

Priyanka Gandhi
Priyanka Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఢిల్లీ, లోధీ రోడ్ లో తాను నివాసం ఉంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్నారు. ఈ ఉదయం ఆ ఇంటి నుంచి సామాన్ల తరలింపు మొదలైంది. తన వ్యక్తిగత సామాన్లను మాత్రం తల్లి సోనియా గాంధీ నివాసమైన 10, జనపథ్ బంగళాకు తరలిస్తున్నారు. కాగా, ఆగస్టు 1లోగా భవనాన్ని ఖాళీ చేయాలని గతవారంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆమెకు కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కూడా తొలగించారు. కాగా, తాత్కాలికంగా సోనియా నివాసానికి సామాన్లను చేర్చినా, త్వరలోనే ఆమె యూపీలోని లక్నోకు మకాం మారుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. లక్నోలోని కేంద్ర మాజీ మంత్రి, నెహ్రూ సమీప బంధువు షీలాకౌల్ భవనంలో ప్రియాంకా గాంధీ, ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఆ ఇంటికి ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపాయి. యూపీలో తదుపరి జరిగే అవెంబ్లీ ఎన్నికల నాటికి, ఆ రాష్ట్రంలోనే మకాంవేసి, పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీలోని తల్లి సోనియాగాంధీ ఇంట్లోనూ, ఇటు లక్నోలోని కౌల్ హౌస్ లోను ఉండాలని ప్రియాంకా భావిస్తున్నట్లు సమాచారం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/