ప్రియాంకా గాంధీకి కరోనా పాజిటివ్

తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విన్నపం

Priyanka Gandhi
Priyanka Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా కోవిడ్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో తనకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను కరోనా ప్రొటోకాల్స్ అన్నీ పాటిస్తున్నానని… హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పారు. తనతో ఇటీవల కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. గురువారం ఆమెకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తన తల్లికి కరోనా సోకిందని తెలియగానే నిన్న లక్నోలో ఉన్న ప్రియాంక తన టూర్ ను రద్దు చేసుకుని ఢిల్లీకి వచ్చేశారు. అయితే, తన షెడ్యూల్ ను ఎందుకు అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో లక్నోలో రెండు రోజుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల నుంచి ఆమె వెనక్కి వచ్చేశారు. ఇంతలోనే ఆమెకు కూడా కరోనా నిర్ధారణ అయింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/