వలస కార్మికుల మృతిపై స్పందించిన ప్రధాని

రైలు ప్రమాద ఘటన తెలుసుకుని చాలా బాధపడ్డాను..ప్రధాని మోడి

Narendra Modi
Narendra Modi, PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదం వలస కార్మికుల మృతిపై స్పందించారు. ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తెలుసుకుని చాలా బాధపడ్డాను. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. అక్కడ పరిస్థితులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయ చర్యలు కొనసాగుతున్నాయి’ అని మోడి ట్వీట్ చేశారు. కాగా, రైలు ప్రమాదంలో గాయపడిన వారికి ఔరంగాబాద్‌ సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రైలు పట్టాలపై కూలీలు ఉన్న విషయాన్ని గుర్తించిన లోకో పైలట్ రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/