మోడికి శుభాకాంక్షలు తెలిపిన శ్రీలంక ప్రధాని

కొలంబో: సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సందర్భంగా శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే మోడికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు కంగ్రాట్స్ నరేంద్ర మోడిజీ, మీతో కలిసి పనిచేయాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఎ న్డీయే కూటమి మెజార్టీ మార్క్ను దాటి 330కి పైగా స్థానాల్లోఅభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/