ఆసుపత్రిలో చేరిన ప్రధాని మోడి తల్లి మీరాబెన్ మోడీ

శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న హీరాబెన్ మోడీ

pm-modi-mother-hospitalised-in-ahmedabad

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ తల్లి మీరాబెన్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. శాసకోశ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆమె చాలా ఇబ్బందికి గురయ్యారు. ఆమెను అహ్మదాబాద్ లోని యూఎస్ మెహతా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల జూన్ లో ఆమె 99వ పడిలోకి అడుగుపెట్టారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తన తల్లి హీరాబెన్ ను మోడీ కలిశారు. మరోవైపు, హీరాబెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తన తల్లిని చూసేందుకు మోడీ అహ్మదాబాద్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్ లో భద్రతను పెంచారు.

మరోవైపు మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు నిన్న రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఆయన కుమారుడు, కోడలు, మనవడు ఉన్నారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో వారు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు డివైడర్ కు గుద్దుకుంది. అయితే ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/international-news/