నేడు, రేపు గుజరాత్లో ప్రధాని పర్యటన
న్యూఢిల్లీ: గుజరాత్లో నేటి నుండి రెండు రోజులపాటు ప్రధాని నరేంద్రమోడి పర్యటించనున్నారు. పర్యాటనలో భాగంగా నిన్న అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. నర్మద జిల్లా కెవాడియాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా సర్దార్ పటేల్ జూలాజికల్ పార్కును, ఏక్తా మాల్ను ప్రారంభించనున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా నిర్వహించే ఏక్తా దివస్ పరేడ్లో పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది అక్టోబర్ 31న ఏక్తా దివస్ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నర్మదా నదీ తీరంలోని ఐక్యతా విగ్రహం వద్ద పటేల్కు నివాళులు అర్పిస్తారు. అన్ని అధికారిక భాషల్లో రూపొందించిన ఐక్యత విగ్రహ నూతన వెబ్సైట్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా కెవాడియాఅహ్మదాబాద్ మధ్య సీప్లేన్ సేవలను జాతికి అంకితం చేస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/