దేశంలో పెరిగిన స్మార్ట్ఫోన్ల ధరలు
దిల్లీ: దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు పెరిగాయి. గత నెలలో మొబైల్ ఫోన్లపై పన్నులను 12శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రకటించింది. దీంతో దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు పెంచుతున్నట్లు ప్రముఖ మొబైల్ సంస్థలు షయోమి, పోకొ, రియల్మి వంటివి ప్రకటించాయి. ప్రస్తుతం వస్తున్న కొత్త మాడళ్లపైనే కాకుండా పాత మాడళ్ల ధరలు కూడా పెంచేశాయి, తమ మాడళ్లపైనా ఐదు శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు యాపిల్ ప్రకటించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/