క్షయ నిరోధానికి మరిన్ని చర్యలు

నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం

prevention of tuberculosis

కరోనా, సార్స్‌, స్వైన్‌ఫ్లూ, క్షయ ఇవన్నీ శ్వాసకోశ సంబంధ అంటువ్యాధులే. అయితే కరోనా, సార్స్‌, స్వైన్‌ఫ్లూ, ఉప్పె నలా విరుచుకుపడేవయితే, క్షయను మాత్రం నిశ్శబ్ధహంతకిగా చెబు తారు. ఎయిడ్స్‌ తర్కాత ఎక్కువ మందిని బలిగొఒంటున్న అంటు వ్యాధి ఈ క్షయ.

మనదేశంతోపాటు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ క్షయరోగం కారణంగా ముఖ్యంగా పేద కుటుంబాలు ఉక్కిరిబిక్కిరయిపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది క్షయ వ్యాధికి గురవ్ఞతుండగా 16 లక్షల మంది

ఈ వ్యాధికారణంగా అసువ్ఞలు బాస్తున్నారు. మైక్రో బాక్టీరియామ్‌ ట్యూబర్‌ క్యులోసిస్‌ అనే బాక్టీరియా ఈ క్షయ వ్యాధిని కలిగిస్తుంది. డాక్టర్‌ రాబర్ట్‌కోచ్‌ క్షయవ్యాధికారక బాక్టీరియాను 1882 మార్చి 24న కనుగొన్నందున, ఆ రోజున ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినంగా జరుపుతున్నారు.

మనదేశంతోపాటు ప్రపంచమంతటా ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నది.

దీర్ఘకాలంగా ఉండే దగ్గు, రాత్రిపూట జ్వరం, చెమటలు పట్టడం, శ్వాసించడంలో ఇబ్బందులు, ఛాతినొప్పి, ఆకలి తగ్గటం, బరువ్ఞ తగ్గడం మొదలైన లక్షణాల ద్వారా ఈ వ్యాధిని ప్రాథమికంగా గుర్తించవచ్చు.

ఛాతీ ఎక్సరే, పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఊపిరితిత్తులకు కాకుండా ఇతర అవయవాలకు సోకిన క్షయను గుర్తించడానికి సి.టిస్కాన్‌ ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ లాంటి పరీక్షలు ఉపకరిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా 30 శాతం జనాభా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది భారత్‌లోనే ఉన్నారు. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది క్షయరోగులు ఉంటారని ఒక అంచనా.

2018లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది ఈ వ్యాధితో మరణించగా మనదేశంలో ఈ మరణాలు నాలుగు లక్షలకు పైగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

2019 టిబి ఇండియా నివేదిక మనదేశంలో ఈ వ్యాధి తీవ్రతను కళ్లకు కట్టింది. ఈ నివేదిక ప్రకారం మనదేశంలో 2017-18లో లక్షల కేసులు నమోదుకాగా, 2018లో 17శాతం పెరిగి 21.5లక్షల కేసులు నమోదయినట్లు తెలుస్తుంది.

హెచ్‌ఐవి రోగుల మరణాలకు టిబి ఒక కారణంగా మారుతుంది. మనదేశంలో 25 లక్షల హెచ్‌ఐవి బాధితుల్లో 18 లక్షల మంది క్షయరోగులున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

ఈ వ్యాధి మూలంగా ఏటా సుమారు 20 వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ప్రధాని వెల్లడించారు.

2030 నాటికి ప్రపంచంలో క్షయలేకుండా చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకల్పిస్తుండగా దానికి ఐదు సంవత్సరాలు ముందుగానే 2025 నాటికి మనదేశంలో క్షయవ్యాధిని నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నది.

కేంద్రం 2019 సెప్టెంబరు ఐదున ‘టిబి హారేగా దేశ్‌ జీతేగా నినాదంతో ఈ వ్యాధి నిర్మూలనకు నడుం బిగించింది. పొగ త్రాగేవారిలో, మద్యపానం, అధికంగా చేసే వారితో, పాన్‌పరాగ్‌, గుట్కా, మత్తుపదార్థాలు వాడేవారు ఎక్కువగా క్షయబారిన పడుతున్నారు.

నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం, పేదరికం, వ్యాధి గురించి అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి విజృంభిస్తున్నది.

బహిరంగంగా పొగతాగరాదన్న నిబంధన ఎక్కడా అమలు జరగడం లేదు. సరైన మోతాదులో మందులు వాడకపోయినా, మధ్యలో మందులు మానివేసినా ఈ వ్యాధి లొంగని మొండి వ్యాధిలా మారుతుంది.

కొన్ని రకాల టిబిలు మందులకు కూడా లొంగడం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వ్యాధి సులభంగా సోకి ఇబ్బందులకు గురిచేస్తుంది.

ఔషధాల కొరత కారణంగా ప్రపంచం లో ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరికే చికిత్స జరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇంకా ఎన్నో క్షయ కేసులను గుర్తించక లెక్కల్లోకి రావడం లేదు.

దగ్గటం, తుమ్మటం ద్వారా తుంపరులతో ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. క్షయ నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా, ఆశించినంతగా ఫలితాలు రావటం లేదు.

ఈ రోగ నిర్మూలనకు కేటాయించే నిధులు సక్రమంగా పారదర్శకంగా ఖర్చయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి.

క్షయవ్యాధి నిర్ధారణ, నిర్మూలన కార్యక్రమాలు విస్తృతంగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొబైల్‌ లాబ్స్‌ ద్వారా మారుమూల ప్రాంతాల్లో రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి.

అధునాతనమైన వైద్యం అందుబాటులోకి వచ్చినా వ్యాధిని అరికట్టలేకపోవడంపై ఆలోచన చేయాలి. 1962లోనే జాతీయ టిబి నియంత్రణ ప్రణాళిక మొదలయినా ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేవ్ఞ. లక్ష్యాలు నిర్దేశించుకుంటే సరిపోదు. ఆ లక్ష్యాలను చేరడానికి సరైన కృషి, ప్రణాళిక అవసరం.

రోగ నివారణలో మన పొరుగు దేశాలు కొన్ని పురోగతి సాధిస్తుండగా మన వెనుకబాటుకు కారణాలను నిజాయితీగా గుర్తించాలి. టిబి నివారణలో రాష్ట్రాల మధ్య మంచి పోటీ ఏర్పడాలి.

గుట్కాలను నిషేధించినా ప్రతి గ్రామంలో ఎక్కడో ఒక చోట ఇప్పటికీ వీటి అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి.

సిబ్బందిలో జవాబుదారీతనం పెంచడంతోపాటు రోగం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి నివారణ చర్యలు సమగ్రంగా చేపట్టాలి. క్షయవ్యాధి పీడితులున్న కుటుంబాల్లోని బాలలు తప్పనిసరి పరిస్థితుల్లో బాలకార్మికులుగా మారుతున్నారు.

వెంట్రుకలు, గోళ్లు,మరికొన్ని భాగాలు మినహా ఏ శరీర భాగంపైనయినా దాడి చేయగలదీ రోగం.

క్షయ వ్యాధి బాధిత కుటుంబాలకు కేంద్రం ‘నిక్షయపోషణ్‌ యోజన కార్యక్రమం కింద 500 రూపాయలు చొప్పున 26 లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ సాయాన్ని వెయ్యి రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉంది.

మందులు వాడిన కొన్ని రోజుల తర్వాత సానుకూల ఫలితాలు వచ్చినా మందులు మధ్యలో ఆపకుండా డోసు ప్రకారం వాడాలి.

పసిపిల్లల్లో క్షయవ్యాధి రాకుండా బిసిజి టీకా వేయించాలి. క్షయ నిర్ధారణకు భారతశాస్త్రవేత్తలు రూపొందించిన ట్రూనాట్‌ టీబిటెస్ట్‌ తొంభై నిమిషాల్లోనే క్షయ లక్షణాలను పట్టేస్తుంది.

ఈ పరీక్షను ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఆమోదించింది.

ప్రభుత్వాల చర్యల్లో పురోగతి కనిపిస్తున్నా, ఇంకా అనేక మంది ఈ వ్యాధి కారణంగా అసులువ్ఞ బాస్తున్నారు.

ఈ వ్యాధి గురించి సమాజాన్ని మరింత చైతన్యం చేయాల్సిన అవసరం చాలా ఉంది. పోలియోలాగా క్షయను కూడా సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వంతోపాటు యావత్‌ సమాజం కంకణబద్ధులు కావాలి.

  • రావి శ్రీనివాసరావు

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/