జ‌గ‌న్‌తో ముగిసిన భేటీ..సినీ ప్రముఖుల మీడియా స‌మావేశం

చిన్న సినిమాల‌కు 5 షోల‌న్న‌ చిరంజీవి
గుడ్ న్యూస్ వింటార‌ని మ‌హేశ్ బాబు

YouTube video

అమరావతి: సీఎం జగన్ తో లుగు సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో వారు చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు. నాగార్జున, జూనియ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, దిల్ రాజు హాజ‌రుకాలేదు. ప్ర‌భుత్వం ముందు టాలీవుడ్ ప్ర‌ముఖులు ప‌లు ప్ర‌తిపాద‌న‌లు ఉంచారు.

అనంత‌రం సినీన టుడు మ‌హేశ్ బాబు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. మొద‌ట‌గా చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల‌ని అన్నారు. ఆయ‌న మొద‌టి నుంచీ చొర‌వ చూపి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశార‌ని అన్నారు. ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ వింటార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వారం/ప‌ది రోజుల్లోనే ఆ శుభవార్త వ‌స్తుంద‌ని చెప్పారు.

టికెట్ ధ‌రల వివాధానికి శుభంకార్డు ప‌డింద‌ని భావిస్తున్నామ‌ని చిరంజీవి చెప్పారు. ఏపీ సీఎం నిర్ణ‌యం అంద‌రినీ సంతోష‌ప‌ర్చింద‌ని చెప్పారు. చిన్న సినిమాల‌కు ఐదో షోకు అనుమ‌తించ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని తెలిపారు. చిన్న సినిమాల నిర్మాత‌ల‌కు మంచి వెసులుబాటు ఇచ్చార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జ‌రుగుతోంద‌ని చిరంజీవి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/