భారత్లో 24 గంటల్లో 1718 కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో భారత్లో 1718 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో.. భారత్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి చేరింది. భారత్లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 25.19గా పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/business/