నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 22న ఉరిశిక్ష

Nirbhaya case convicts
Nirbhaya case convicts

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ పిటిషన్ ను రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ పంపించింది. దీంతోపాటే నిర్భయ దోషులు అత్యంత దారుణానికి పాల్పడ్డారని, వీరికి క్షమాభిక్ష పెట్టవద్దని రాష్ట్రపతిని కోరింది. ఈ నేపథ్యంలో పిటిషన్ ను పరిశీలించిన రాష్ట్రపతి ఎక్కువ సమయం కూడా తీసుకోకుండానే పిటిషన్ ను తిరస్కరించారు. క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కాబోతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 22న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ నేపథ్యంలో అధికారులు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 22న ఉరిశిక్ష అమలవుతుందా? లేని మరి కొన్ని రోజులు పడుతుందా? అనేది వేచి చూడాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/