ఉపాధ్యాయ దినోత్సవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
తెలంగాణ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు అవార్డులు
న్యూఢిల్లీః రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం బోధనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో టీఎన్ శ్రీధర్, కందాల రామయ్య, శ్రీమతి సునీత రావు ఉన్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో వీరు రాష్ట్రపతి నుంచి అవార్డులు స్వీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/