మహబూబాబాద్ జిల్లాలో డాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాలింత మృతికి కారణమైన డాక్టర్ రవిని సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి ఆదుకోవాలని ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే..మరిపెడ గ్రామానికి చెందిన వడ్డూరి భాగ్యలక్ష్మి (25) మే 15 మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవి నార్మల్ డెలివరీ చేశారు. గతంలో ఒక బాబు ఉండగా మరోసారి ఇప్పుడు మగ బిడ్డకు జన్మనిచ్చింది భాగ్యలక్ష్మి. డెలివరీ సమయంలో చిన్న ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశారు. అయితే బ్లీడింగ్ కంట్రోల్ కాకపోవడంతో ఎమర్జెన్సీ కేసుగా నిర్ధారించి మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి అంబులెన్సులో తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ నిర్ధారించడంతో మృతురాలి బంధువులు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తూ..ఆందోళనకు దిగారు.