జగన్ బిచ్చం ఎత్తుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదస్పద కామెంట్స్

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి..ఆంధ్ర వాళ్ల ఫై చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి..నిధులు లేక ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే.. అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేసారు.

ఏపీకి మన పైసలు పోకపోవడంతో ఆ రాష్ట్ర సీఎం జగన్ రోజు వారీ ఖర్చులకే కేంద్రం బిచ్చమెత్తుకుంటుండని.. అందుకే బాయి కాడ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నారని విమర్శించారు. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ హైదరాబాద్ ను అభివృద్ధి చేశారన్నారు. అయినా కేసీఆర్ ఏమి అడుక్కోవడానికి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారని ప్రశ్నించారు. మా సంగతి పక్కన పెట్టి మీకెన్ని అప్పులున్నాయో.. బ్యాంకులు, కాంట్రాక్టర్లను అడిగితే తెలుస్తుందన్నారు.

గతంలో పోతిరెడ్డి పాడు నీటి గురించి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం తో పాటుగా ఆయన తండ్రి వైఎస్సార్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లందరూ తెలంగాణ వ్యతిరేకులేనంటూ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఆ తరువాత వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు జగన్ ఫై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు.