మారుతీరావు సూసైడ్ నోట్లో ఏం రాశాడు?
హైదరాబాద్: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మొదట ప్రచారం జరిగినా.. విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఓ ప్రముఖ న్యాయవాదిని కలిసేందుకు వచ్చి మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది. ఘటనపై సైఫాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మారుతీరావు గదిలో ఓ సూసైడ్ నోట్ దొరికినట్టు సమాచారం. అందులో ‘గిరిజా క్షమించు.. అమృత మీ తల్లి వద్దకు వెళ్లిపో..’ అంటూ భార్యాబిడ్డలను ఉద్దేశించి మారుతీరావు పేర్కొన్నట్టు తెలుస్తోంది. లేఖలో ఉన్న మిగతా వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై స్పందించేందుకు మారుతీరావు డ్రైవర్ నిరాకరించాడు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/