నరేష్ .. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు – ప్రకాష్ రాజ్ వార్నింగ్
మా ఎన్నికల వేడి..పొలిటికల్ వేడిని మించుతుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ , విష్ణు ప్యానల్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విష్ణు ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్న నరేష్..పదే పదే ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదంటూ మాట్లాడడం ఫై ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడని నరేష్ కు వార్నింగ్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. కొంచెం కోపం, బాధతో వేసే ఓటు సునామిలో మంచు విష్ణు కొట్టుకుపోవాలన్నారు ప్రకాశ్ రాజ్.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీ బంధువైతే… మా ఎన్నికలకు వస్తారా ? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. రెండు సార్లు హలో చెబితే… కేటీఆర్ ఫ్రెండ్ అయిపోతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మా ఎన్నికల్లో జగన్, కేసీఆర్, బీజేపీని లాగుతారా అని నిలదీశారు. తన అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్ లో ఎవరికి రాదని… మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముంచు ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో ‘పవన్ కళ్యాణ్ మార్నిగ్ షో కలెక్షన్స్ అంత ఉండవు మీ సినిమా బడ్జెట్’ అని అన్నాడు. మొత్తం మీద మా ఎన్నికల ప్రచారం మాత్రం మహా వేడి గా నడుస్తుంది.