హోటల్ బిజినెస్ మొదలుపెట్టబోతున్న ప్రభాస్..?

వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ఇప్పుడు హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడట. కాకపోతే ఈ బిజినెస్ మన దగ్గరకాదు..దుబాయ్ తో పాటు మరికొన్ని దేశాల్లో హోటల్ బిజినెస్ స్టార్ చేయాలనీ అనుకుంటున్నాడట. ఈ బిజినెస్ తాను సొంతగా కాదు తన స్నేహితులైన వంశీ – ప్రమోద్ లతో కలిసి స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వంశీ – ప్రమోద్ లు కలిసి యువీ క్రియేషన్స్ పేరిట బ్యానర్ స్టార్ట్ చేసి అందులో ప్రభాస్ ను భాగస్వామిని చేసి లాభాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అంతే కాదు నెల్లూరు లో వీరు ఓ మల్టిప్లెక్సీ థియేటర్ సైతం నడుపుతున్నారు. ఇక ఇప్పుడు హోటల్ బిజినెస్ లోకి దిగాలని చూస్తున్నారు.

యూవీ వారి విదేశీ హోటల్ బిజినెస్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ లో వరుసగా భారీ చిత్రాలు మరియు చిన్న చిత్రాలు నిర్మాణం జరుగుతున్నాయి. ఇదే సమయంలో వారు ప్రభాస్ తో కలిసి ఈ బిజినెస్ లో ఎంట్రీ అవ్వబోతున్నట్లుగా వారికి అత్యంత క్లోజ్ గా ఉండే కొందరు మీడియా వారు అనధికారికంగా చెబుతున్నారు. ప్రభాస్ ఏ బిజినెస్ చేసినా కూడా వంశీ ప్రమోద్ లు ముందు ఉంటారు అనేది టాక్. కనుక ఈ హోటల్ బిజినెస్ లో ప్రభాస్ మెజార్టీ వాటా ను కలిగి ఉన్నా కూడా యూవీ వారి భాగస్వామ్యం ఉంటుందని అంటున్నారు. కనుక ప్రభాస్ యూవీ హోటల్స్ అతి త్వరలో దుబాయ్.. స్పెయిన్ ఇంకా కొన్ని చోట్ల రాబోతున్నాయి.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే..సాహో మరియు రాధేశ్యామ్ నిరాశ పర్చినా కూడా ఆయన తదుపరి సినిమాలపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. సలార్.. ఆదిపురుష్.. ప్రాజెక్ట్ కే.. స్పిరిట్.. రాజా డీలక్స్ ఇలా అన్ని సినిమాలపై కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ప్రాజెక్ట్ కే షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక ప్రభాస్ మొదటి హిందీ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివర్లో రాజా డీలక్స్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.