‘ప్రాజెక్ట్ కే’ కోసం రూ. 40 కోట్ల సెట్స్..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ – దీపికా పదుకొనె జంటగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా గా భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షెడ్యూల్స్ పలు జరుగగా..తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కొనసాగుతుంది. దాదాపు రూ. 40 కోట్లతో నిర్మించిన నాల్గు సెట్స్ లో షూటింగ్ నడుస్తుంది. ఈ సెట్లలో భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్స్ కోసం విదేశాల నుంచి ఫైటర్స్ ను రప్పించారట.

ఇదిలా ఉంటె ఈ సినిమా తాలూకా ఆసక్తికర విశేషాలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు. ‘ఇది చాలా కొత్త సినిమా. స్క్రిప్ట్ కూడా కొత్తది. దీని కోసం తయారుచేసిన ప్రపంచం.. టెక్నీషియన్స్ అంతా కొత్తగా ఉంటాయి. ఒకరకంగా ఈ సినిమా ఎలా చేయాలి అని ఆలోచించడానికే చాలా సమయం పడుతుంది. అన్నీ కొత్తగా తయారుచేయాలి. ‘మహానటి’ సినిమా కోసం కారు కావాలంటే అద్దెకు తెచ్చుకున్నాం. ఈ సినిమాకు అలా కుదరదు. అన్నీ మేం తయారుచేసుకోవాలి. కాబట్టి కచ్చితంగా సినిమా కొత్తగా అయితే ఉంటుంది’’ అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

ఇక సై-ఫై జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా , దిశా పటానీలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు రూ.500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.