ప్రభాస్ పాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ను చేంజ్ చేసారా..?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ మూవీస్ కు సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు కాదు దాదాపు నాల్గు సినిమాలు చేస్తున్నాడు. వీటిల్లో ముందుగా రాధే శ్యామ్ మూవీ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత ఆదిపురుష్ , సలార్ తర్వాత నాగ్ అశ్విన్ మూవీ రాబోతుంది.

మహానటి చిత్రంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ..ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తుండడం తో అందరిలో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. మొదట ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ ని అనుకున్నారు. కానీ తాజాగా అతని ప్లేస్ లో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ వచ్చినట్లు తెలుస్తోంది. వైజయంతి సంస్థ వారి ట్వీట్ ని సంతోష్ రీట్వీట్ చేశారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.