మళ్లీ సుజిత్ తో ప్రభాస్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ..ప్రస్తుతం నాల్గు పాన్ మూవీస్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ , ఆదిపురుష్ , సలార్ తో పాటు బాలీవుడ్ డైరెక్టర్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఇలా ఈ నాల్గు లైన్లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ తో సాహో వంటి భారీ యాక్షన్ తెరకెక్కించిన సుజిత్ కు మరో ఛాన్స్ ఇచ్చినట్లు వినికిడి.

బాహుబలి తరువాత డార్లింగ్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. అంతకు మించి చూపించిన యాక్షన్‌ డ్రామా సాహో. తెలుగు ఆడియన్స్‌కు అంతగా నచ్చకపోయినా బాలీవుడ్ ఆడియన్స్‌ను మాత్రం ఫిదా చేసింది ఈ మూవీ. అందుకే మరోసారి సుజిత్ చెప్పిన కథ కు ఓకే చెప్పాడట. చిరంజీవి హీరోగా లూసీఫర్ రీమేక్‌ కోసం కొద్దిరోజులు వర్క్ చేసిన సుజిత్‌.. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో మరోసారి కెరీర్‌లో లాంగ్ గ్యాప్ వచ్చింది. ఈ టైమ్‌లో మరో హీరో కోసం వెయిట్ చేయటం కన్నా.. తనకు లైఫ్ ఇచ్చిన ప్రభాస్ తోనే సినిమాచేయాలని ఫిక్స్ అయ్యారట సుజిత్. ఆల్రెడీ ప్రభాస్ కు లైన్‌ ఓకే చేయించుకున్న ఈ యంగ్ మేకర్‌ ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.