జపాన్లో భారీ భూకంపం
టోక్యో: జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని టోక్యోలో శనివారం ఉదయం 8.14 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేల్పై 6.0గా నమోదయ్యింది. భూకంప కేంద్రం టోక్యోకు ఈశాన్యంగా 407 కి.మీ. దూరంలో ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. కాగా, ఇప్పటివరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీచేయలదేని అధికారులు వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/