జగన్ కేసుల విచారణ వాయిదా
ఈ నెల 12కి వాయిదా..హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో విచారణ
హైదరాబాద్: ఏపి సిఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఈ రోజు ఈ కేసును మరోసారి పరిశీలించిన న్యాయస్థానం ఈ నెల 12కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసులను నవంబరు 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ఈడీ, సీబీఐ అధికారులు నమోదు చేసిన మరికొన్ని కేసులు ఈ రోజు విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/