నటి పూర్ణ ఎవర్ని పెళ్లి చేసుకోబోతుందో తెలుసా..?

సీమటపాకాయ్ ఫేమ్ నటి పూర్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. క్లాసికల్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన పూర్ణ…ఆ తర్వాత హీరోయిన్‌గా స్థిరపడిపోయింది. ‘శ్రీ మహాలక్ష్మీ’ అనే సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలోనే సీమటపాకాయ్, సిల్లీ ఫెలోస్, అదుగో, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు వంటి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పింది. వెండితెరపై తన నటనతో తనదైన ముద్రను వేసుకున్న పూర్ణ.. బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ఇప్పటికే వేరే భాషల్లో పలు షోలలో పని చేసిన ఈ అమ్మడు.. తెలుగులో ‘ఢీ’ అనే డ్యాన్స్ షోకు జడ్జ్‌గా చేస్తోంది. దాదాపు మూడు సీజన్లుగా ఇందులో కనిపిస్తోన్న ఆమె.. అద్భుతమైన జడ్జ్‌మెంట్‌తో ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలో తన పెళ్లి గురించి చెప్పి షాక్ ఇచ్చింది. తాను చేసుకోబోయే వ్యక్తితో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన పూర్ణ.. ఈ మేరకు ‘మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో ముందడుగు వేయబోతున్నా. షానిద్ ఆసిఫ్ అలీతో ఎంగేజ్‌మెంట్ అయిపోయింది’ అంటూ పోస్ట్ చేసింది. షానిద్ ఆసిఫ్ అలీ ఓ బిజినెస్ మాన్ అని తెలుస్తుంది. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ అని సమాచారం. కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అని అంటున్నారు.