పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారంటూ పొంగులేటి ఫైర్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడు రైతు భరోసా యాత్రలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారని, ఇప్పటికీ 9 సంవత్సరాలు గడుస్తున్నా కేసీఆర్ ఒక్క ఎకరం పోడు భూమికి పట్టా ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు.

పథకాలను అమలు చేయడమంటే.. మాటలు చెప్పినంత సులభం కాదుని అన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తానని చెప్పి.. వారి మీద కేసులు పెడుతూ జైలు పాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొత్తగూడెం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేయడానికి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారాయన. అయితే అక్కడ కలెక్టర్ లేకపోవడంతో కలెక్టర్ రూమ్ కు నమస్కారం చేసిన పొంగులేటి అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.