గద్వాల్ లో రాజకీయ పార్టీ గల్లీ నాయకుల గలీజు దందాలు

గద్వాల్ లో ఓ రాజకీయ పార్టీ గల్లీ నేతల గలీజు దందాలు బయటపడ్డాయి. పలువురు విద్యార్థులు, స్థానిక మహిళలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి న్యూడ్ కాల్స్ మాట్లాడటంతో పాటు.. వాటిని రికార్డు చేసి బెదిరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.

తాము అడిగిన డబ్బు ఇవ్వటంతో పాటు తాము చెప్పిన వాళ్లతో గడపాలంటూ బెదిరించటం.. ఒకవేళ ఒప్పుకోకపోతే.. ఇంట్లో వాళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ వీడియోలు పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనాయకులు ఉన్నారన్న ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో పెద్ద చర్చకు దారితీశాయి. వాళ్ల మధ్య విభేదాలు రావడంతో ఈ ఘటన వెలుగులో చూసినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే..

కొంతకాలంగా గద్వాల జిల్లాలో ఉన్న పలు పాఠశాల, కాలేజీలకు చెందిన విద్యార్థినిలను.. స్థానిక మహిళలను ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నారు. వారికి మాయమాటలు చేప్పి.. వారితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడటం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆ మాట్లాడే క్రమంలో వీడియోలను రికార్డు చేస్తున్నారు. అనంతరం ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని.. బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం. అయితే.. ఈ ముగ్గురు నాయకుల్లో ఒకరికి సంబంధించిన బంధువైన మహిళ ఫొటో కూడా ఉండటంతో.. ముగ్గురి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఒకరి మీద కోపంతో ఒకరు.. వాళ్ల దగ్గరున్న అశ్లీల ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పెట్టారు. ప్రస్తుతం పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.