లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేశ్
ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు

గన్నవరం: టీడీపీ నేత నారా లోకేశ్ నరసరావుపేట పర్యటన ఉత్కంఠభరితంగా మారింది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేశ్ ను ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను ఎక్కడకు తరలిస్తారనే ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు నారా లోకేశ్ వస్తున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని… అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు. మరోవైపు టీడీపీ కీలక నేతలందరినీ పోలీసులు ఇప్పటికే గృహనిర్బంధం చేశారు. లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/