బంజారాహిల్స్‌లో ర్యాడిసన్ బ్లూ పబ్ ఫై పోలీసుల దాడి..పలువురు సినీ స్టార్స్ అరెస్ట్

వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లోని పలు పబ్స్ ఉగిపోతుంటాయి. సామాన్య ప్రజల నుండి సినీ స్టార్స్ , రాజకీయ ప్రముఖుల కుమారులతో పాటు ఇతర రంగాల వారికీ చెందిన వారు పెద్ద సంఖ్య లో పబ్స్ కు చేరుకొని ఫుల్ గా మద్యం సేవించి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్ని పబ్స్ ప్రభుత్వ నియమాలు అతిక్రమించి సమయానికి మించి పబ్స్ నడుపుతుంటారు. ఈ తరుణంలో పోలీసులు దాడి చేయడం మొదలుపెట్టారు. నిన్న శనివారం కూడా అలాగే పలు పబ్స్ ఫై దాడులు చేయడం జరిగింది.

బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై గతరాత్రి పోలీస్ దాడి చేసారు. అర్దరాత్రి దాటినా సమయానికి మించి పబ్ నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు… యజమానులతో సహా సుమారు 150మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్టు చేసిన 150 మందిని బంజారాహిల్స్ పీఎస్ కి తరలించారు. పట్టుబడిన యువకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా వారు స్టేషన్‌లో హంగామా సృష్టించారు. తమను ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారంరంటూ ఆందోళనకు దిగారు.

రాత్రి 3 గంటల సమయంలో దాడులు నిర్వహించిన పోలీసులు… వారిని అరెస్టు చేశారు. అయితే పోలీసుల అదుపులోకి టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు పెద్ద ఫ్యామిలీకి సంబదించిన డాటర్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. నిర్వాహకులు అభిషేక్‌ ఉప్పల్‌, అనిల్‌ కుమార్‌ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.