వారి త్యాగాలు, సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి..ప్రధాని

పోలీసుల సంస్మ‌ర‌ణ దినం..ప్రధాని మోడి నివాళి

pm modi

న్యూఢిల్లీ: నేడు అమరవీరుల సంస్మ‌ర‌ణ దినం.. సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి ట్వీట్ చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా అమ‌రులైన పోలీసుల‌కు నివాళి అర్పిస్తున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. వారి త్యాగాలు, సేవ‌ల‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటామ‌న్నారు. శాంతి, సామ‌రస్య స్థాప‌న‌లో, క్రూర‌మైన నేరాల‌ను ప‌రిష్క‌రించ‌డంలో, కోవిడ్‌19 లాంటి మ‌హ‌మ్మారి వేళ పోలీసులు చూపిన సాహ‌సం అనన్య‌మైంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఎటువంటి సంకోచం లేకుండా వారు సేవ చేస్తార‌న్నారు. పౌరుల‌కు సహ‌క‌రించేందుకు వారెప్పుడూ సిద్ధంగా ఉంటార‌ని, దాని ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/