నిహారిక భ‌ర్త‌ చైత‌న్య‌పై కాల‌నీ వాసుల ఫిర్యాదు

గుంపులుగా కొంద‌రు వ‌స్తున్నారంటూ కాల‌నీవాసుల ఫిర్యాదు

హైదరాబాద్: సినీ న‌టుడు నాగ‌బాబు కూతురు, అల్లుడు నిహారిక‌, చైత‌న్య హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ నుంచి షేక్‌పేట్‌కు వెళ్లే దారిలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తమ వృత్తిపరమైన అవ‌స‌రాలకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఈ ఫ్లాట్ తీసుకున్నారు. అయితే, క‌రోనా స‌మ‌యంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ వారు త‌మకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చైతన్యపై అపార్ట్‌మెంట్‌ వాసులు గ‌త అర్ధ‌రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెసిడెన్షియల్‌ సొసైటీలో వాణిజ్య పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభ్యంత‌రాలు తెలిపారు. కొంద‌రు గుంపులుగా ఫ్లాట్‌లోకి వస్తున్నారని అన్నారు. దీంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని చెప్పారు. దీంతో కాల‌నీ వాసుల‌పై చైత‌న్య కూడా ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్‌మెంట్‌ వాసుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పాడు. ఇరు వర్గాల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/