ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోడీ

గత కొద్దీ రోజులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు వార్తల్లో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ పైనే పలు ఆరోపణలు చేస్తూ వస్తున్న శ్రీధర్ రెడ్డి..తాజాగా తన ఫోన్ ను సైతం ట్యాపింగ్ చేసారని చెపుతూ..ఇంత అవమానాన్ని భరిస్తూ పార్టీ లో ఉండలేనని తేల్చి చెప్పారు. త్వరలోనే ఈయన టీడీపీ పార్టీలోకి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా కోటంరెడ్డితో సహా మరో ఇద్దరి పైన నెల్లూరు జిల్లా వేదాయపాళెం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది.

నెల్లూరు పట్టణ 22వ డివిజన్ కార్పోరేటర్ విజయ భాస్కర్ రెడ్డి ..ఎమ్మెల్యే కోటం ఫై పోలీసులకు పిర్యాదు చేసారు. ఎమ్మెల్యే తమను బెదిరిస్తున్నారని పిర్యాదు లో పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోనుచేసి తన అంతు చూస్తామని బెదిరించారని , ఇంటికి వచ్చి భయాందోళనకు గురిచేయటంతో పాటుగా తనను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారని పిర్యాదు లో వివరించారు. తన ఇంటికి వచ్చి భయాందోళనకు గురిచేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయ భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసు స్టేషన్ లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటుగా అనుచరులు మిద్దె మురళీకృష్ణ యాదవ్‌, అంకయ్యపై కిడ్నాప్‌ యత్నం కేసు నమోదు చేసారు పోలీసులు.