ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..అదుపులోకి ఆరుగురు టెర్రరిస్టులు

దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేయగా..ఆ ప్లాన్ ను భగ్నం చేసారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో ఆరుగురు ముష్కరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తేల్చారు.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోని రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లకు వీరు కుట్రపన్నారని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ కమిషనర్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. నవరాత్రుల సమయంలో రామ్‌లీలా మైదానంతో పాటు దుర్గా పూజా మండపాల వద్ద పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని చెప్పారు. ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని ఫామ్‌హౌస్‌లో శిక్షణ పొందారని, ఆర్డీఎక్స్ బాంబును అండర్‌‌వరల్డ్ సాయంతో ఢిల్లీకి తీసుకువచ్చారని ఠాకూర్ తెలిపారు. ఇంటెలిజెన్స్ హెచ్చ‌రిక‌ల మేర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, ప్ర‌యాగ్‌రాజ్, ఢిల్లీలో సోదాలు నిర్వ‌హించి ఉగ్ర‌వాదుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

Delhi Police Special Cell has busted a Pak-organised terror module, arrested 6 people including two terrorists who received training in Pakistan pic.twitter.com/ShadqybnKU— ANI (@ANI) September 14, 2021