బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్

కరోనా వైరస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్

bandi sanjay
bandi sanjay

హైదరాబాద్‌: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బండి సంజయ్‌ డిమాండ్ చేస్తున్నారు. అలాగే, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. అవసరమైన మేరకు కరోనా పరీక్షలు చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాలు లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో మాత్రం కనీసం వేల సంఖ్యలో కూడా చేయట్లేదని చెప్పారు. కరోనా పరీక్షల‌ సంఖ్య పెంచాలని, వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా హైదరాబాద్‌లోని కోఠి కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు ఈ రోజు ఉదయం బిజెపి తెలంగాణ నేతలు ప్రయత్నించారు. ఈనేపథ్యంలోనే బండి సంజయ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/