ఏపి అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు

AP police arranged security
AP police arranged security

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో మంగళవారం చర్చ జరగనుంది. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. టిడిపి శ్రేణులు పోలీసులపై రాళ్ల దాడి చేసిన నేపథ్యంలో.. సమావేశాల్లో రెండో రోజు భాగంగా అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. గరుడా కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని గ్రామాల్లో బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రత్తమయ్యారు. కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. నిరసనలు ఎవరి గ్రామాల్లో వారు శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/